ప్రయాణికులకు TSRTC మరో గుడ్ న్యూస్

by Disha Web Desk 19 |
ప్రయాణికులకు TSRTC మరో గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వరుస సెలవుల నేపథ్యంలో ఇవాళ, రేపు సుదూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా తెలిపారు. హైదరాబాద్ నుంచి చెన్నై, షిర్డీ, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక సర్వీసులను సంస్థ నడుపుతోందని తెలిపారు. ప్రయాణికులు అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in లో టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు. పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

Next Story

Most Viewed